A-AA+ English
లాగిన్

తరచుగా అడిగే ప్రశ్నలు

భూసేవ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
"భూసేవ" ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన IT ప్రాజెక్టులలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని e-ప్రగతి కార్యక్రమంలో ఉన్న ముఖ్య ప్రాజెక్టులలో “భూసేవ” ప్రధానమైనది.
ఆధార్ ఏ విధంగా వ్యక్తి యొక్క గుర్తింపును సులభతరం చేస్తుందో, భూసేవ అటువంటి ప్రయోజనాలను భూమి యొక్క గుర్తింపు కొరకు అందిస్తోంది. భూభాగాలను గుర్తించడం, వాటికి భూ అక్ష్యాంశాల(Geo-Coordinates) తో అనుసంధానం చేయడం, ప్రతి భూభాగానికి ప్రత్యేక (unique) గుర్తింపు సంఖ్య కేటాయించడంతో పాటు, డిజిటైజ్ రూపంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తి భౌగోళిక పటాన్ని నెలకొల్పడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యాలు. అంతేకాక, "భూసేవ" అని పిలువబడే ఏకీకృత వేదిక ద్వారా భూమికి సంబంధించి ప్రభుత్వ విభాగాలన్నీ సమీకృత సేవలను అందించుటకు వీలు కలుగును. తద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు అందజేయబడును.

భూధార్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

జాతీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ విధానాలను అంచనా వేసి భూధార్ యొక్క ఆకృతి రూపకల్పన చేయడమైనది. 11 అంకెల సంఖ్యను ఉంచడానికి నిర్ణయం తీసుకోబడింది, ఇక్కడ మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్ కోసం కేటాయించబడతాయి.
తన భూభాగంపై ‘భూధార్ కేటాయింపు' కోసం పౌరడు దరఖాస్తు చేసుకున్నప్పుడు - సంబంధిత భూవ్యవహారాల విభాగం అక్ష్యాంశాల పై భూధార్ కేటాయించును.