"భూసేవ" ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన IT ప్రాజెక్టులలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని e-ప్రగతి కార్యక్రమంలో ఉన్న ముఖ్య ప్రాజెక్టులలో “భూసేవ” ప్రధానమైనది.
భూభాగాలను గుర్తించడం, వాటిని లొకేషన్ (Geo-Coordinates) తో అనుసంధానం చేయడం, ప్రతి భూభాగానికి ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించడంతో పాటు, డిజిటైజ్ రూపంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తి భౌగోళిక పటాన్ని నెలకొల్పడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యాలు.
ఆధార్ ఏ విధంగా వ్యక్తి యొక్క గుర్తింపును సులభతరం చేస్తుందో, భూసేవ అటువంటి ప్రయోజనాలను భూమి యొక్క గుర్తింపు కొరకు అందిస్తోంది. ప్రతి భూ విభాగానికి "భూధార్" అనే విశిష్ట సంఖ్య యజమాని వివరములు, భూమి వివరములు మరియు లొకేషన్ తో అనుసంధానించి ఇవ్వబడుతుంది.
భూధార్ సంఖ్య ద్వారా భూ సంబంధిత సేవలు మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ మరియు ఇతర ఆస్తి సంబంధిత లావాదేవీలు సులభంగా పొందవచ్చును
అంతేకాక, "భూసేవ" అని పిలువబడే ఏకీకృత వేదిక ద్వారా భూమికి సంబంధించి ప్రభుత్వ విభాగాలన్నీ సమీకృత సేవలను అందించుటకు వీలు కలుగును. తద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు అందజేయబడును.